Sunday, May 19, 2024

పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘన నివాళి..

ఎ. కొండూరు ప్రభన్యూస్ భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండలంలోని చీమలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ..పూర్వ విద్యార్థులు.. ఉపాధ్యాయులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలనే సంకల్పంతో అమరజీవి పొట్టి శ్రీరాములు 59రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement