Monday, April 29, 2024

అమ‌రావ‌తి రైతుల‌కు వ్య‌తిరేకంగా పోస్ట‌ర్లు-మండిప‌డుతోన్న టిడిపి..జ‌న‌సైన‌..రైతులు

అమ‌రావ‌తి రైతులు చేస్తోన్న పాద‌యాత్ర తాడేప‌ల్లిగూడెంకి చేరుకుంది.ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఫ్లెక్సీల వార్ నెలకొంది. కొందరు అమరావతి రైతులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా… మరికొందరు రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైతులకు వ్యతిరేక ఫ్లెక్సీల్లో ‘గో బ్యాక్ ఫేక్ యాత్రికులు’ అని పేర్కొన్నారు. రైతుల ముసుగులోని ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అని ఫ్లెక్సీల్లో రాశారు. ‘అమరావతి రియలెస్టేట్ వద్దు. ఆంధ్రా స్టేట్ ముద్దు’ అని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం జగన్ ఆరాటం… 26 గ్రామాల కోసం చంద్రబాబు నకిలీ పోరాటం అని రాశారు. జగన్ ది అభివృద్ధి మంత్రం.. చంద్రబాబుది రాజకీయ కుతంత్రం అని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఫ్లెక్సీలపై అమరావతి రైతులు, టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement