Monday, April 29, 2024

ట్రావెల్స్ బస్సులో అర కిలో బంగారం.. 57 వజ్రాలు పట్టివేత

కర్నూల్ పట్టణ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం తెల్లవారజామున పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాదు నుండి బెంగళూరుకు వెళుతున్న ఓ ప్రవేటు ట్రావెల్ బస్సులో తనిఖీ చేయగా అందులో రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి బ్యాగులో సుమారు 840 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు, 57 వజ్రాలను సెబ్ పోలీసులు గుర్తించారు. వీటి విలువ ప్రస్తుతం మార్కెట్లో 39,28 లక్షల విలువ చేస్తుందని సెబ్ సిఐ మంజుల వెల్లడించారు. నగలు, వజ్రాలకు సంబంధించిన పత్రాలు లేకపోవడంలో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement