Thursday, April 25, 2024

AP : అధికారంలోకి ప్రజా ప్రభుత్వం రాగానే పోలీసు నియామకాలు: లోకేష్

ఏపీలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీసు నియామకాలు చేపడతామని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. తాడేపల్లిలోని పైన్‌ ఉడ్‌ అపార్ట్‌మెంట్‌ వాసులతో నారా లోకేష్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. పోలీసు నియామకాలన్నీ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.

- Advertisement -

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతాం అని వారికి హామీ ఇచ్చాను. లోకేష్‌తో పాటు గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. జగన్ పాలనలో దళితులు, మైనార్టీలు, బీసీలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గానికి చేసిన మోసాలు ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని, నియోజకవర్గం అభివృద్ధి కోసం తన వద్ద ఉన్న ప్రణాళికలు ప్రజలకు చెప్పానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement