Saturday, April 27, 2024

National : త్వరలోనే పీవోకే భారత్‌లో విలీనం…కేంద్ర హోంశాఖ మంత్రి

త్వరలోనే పీవోకే భారత్‌లో విలీనం అవుతుంద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ల‌ద్దాఖ్‌లోని లేహ్ సైనిక స్థావ‌రాన్ని ఆయ‌న ప‌రిశీలించారు. హోలీ పండుగ సందర్భంగా జవానులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవోకే ప్రాంతంలోనే ప్రజల నుంచి అనేక భారత్‌తో తమ ప్రాంతాన్ని విలీనం చేసుకోవాలంటూ డిమాండ్లు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో పీవోకే విలీనం అవుతందనే విశ్వాసం తనకు వంద శాతం ఉందన్నారు. ఢిల్లీ దేశ రాజధాని, ముంబై ఆర్థిక రాజధాని అయితే, లద్దాఖ్ మన దేశ శౌర్యానికి రాజధాని అని రాజ్‌నాథ్ అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement