Saturday, May 18, 2024

పోల‌వ‌రం ఫండ్స్ క్లియ‌ర్ చేయాలి.. గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో జ‌గ‌న్ భేటీ..

కేంద్ర జనవనరుల శాఖా మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో భేటీ అయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ.55, 548.87 కోట్లుగా నిర్ధారించింది. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని సీఎం జ‌గ‌న్ షెకావ‌త్‌కు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వైజ్‌గా బిల్లుల చెల్లింపును సవరించాలన్నారు.

ఈ ఆంక్షల వల్ల రూ.905 కోట్ల బిల్లులను కూడా పోలవరం ప్రాజెక్ట్‌అథారిటీ తిరస్కరించిందని తెలియ‌జేశారు. మొత్తం ప్రాజెక్టు పనులను పరిగణలోకి తీసుకోవాలన్న ముఖ్యమంత్రి, పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement