Friday, May 17, 2024

రూ.కోటి విలువ చేసే పైపులు అగ్నికి ఆహుతి.. కర్నూలులో ఘటన

క‌ర్నూలు నగరపాలక సంస్థకు చెందిన రూ.కోటి విలువ చేసే మంచినీటి పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలోని సుందరయ్య పార్క్ లో మంటలు చెలరేగాయి. ఈ పార్కులో కర్నూల్ కార్పొరేషన్ అధికారులు మంచినీటి పైపుల వినియోగం కోసం భారీగా పైపులను డంపు చేశారు. అయితే ఆకతాయిలు ఎవరో నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. వీటివల్ల కోటి రూపాయ‌ల‌ విలువ చేసే పైపులు కాలిపోయాయి. రెండు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement