Friday, May 10, 2024

AP : రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తి దుర్మరణం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మందస మండలం దేవుపురం గ్రామానికి చెందిన ఎన్ రమేష్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన రమేష్(రాజు) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు,సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కాశీబుగ్గ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement