Thursday, May 2, 2024

ప్రజలు మార్పును కోరుకుంటున్నారు, జిల్లాల పర్యటనకు ప్రజా స్పందన అద్భుతం: చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వం మార్పును కోరుకుంటున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం జిల్లాల పర్యటనపై ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. తన జిల్లాల పర్యటనకు వస్తున్న ప్రజా స్పందన అద్భుతంగా ఉందన్నారు. గత మూడు రోజులుగా సాగిన తన జిల్లాల పర్యటన అద్భుతంగా ఉందని, ఏడు జిల్లాలలోని 21 నియోజకవర్గాలలో లక్షల మందికి చేరువగా పర్యటన సాగిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు ప్రభుత్వ బాధుడే బాదుడుపై ప్రజల అభిప్రాయాలు, ఆవేదన, ఆగ్రహం ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయన్నారు.

ప్రతీ ఇంట్లో, ప్రతీ గ్రామంలో ప్రజలు మార్పును కోరుకుంటున్న తీరును స్పష్టంగా కనిపించిందని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. తె లుగు తమ్ముళ్ళలో కసి, ప్రజల్లో టీడీపీపై ఆసక్తి రానున్న మార్పు సూచిస్తున్నాయని తెలిపారు. వాడవాడలా వెల్లువలా కదిలి అర్ధరాత్రి సైతం ఎదురేగి స్వాగతం పలికిన కార్యకర్తలకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టూర్‌కు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికే ఒక సందేశం ఇచ్చిందని చంద్రబాబు ట్వీట్‌లో స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement