Sunday, April 28, 2024

Pawan Kalyan – 27 నుంచి జనంలోకి వారాహితో జనసేనాని….

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి జనసేనాని శ్రీకారం చుడతారని ఆ పార్టీ వర్గాలు వెల్ల‌డించాయి.. అంటే గతంలో వారాహి ఎక్కి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన పవన్.. ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. ఎన్నికల తరుణంలో ఇప్పుడు మరోసారి ఆంద్రప్రదేశ్‌లో వారాహి రోడ్డెక్కనుంది..

వారాహి రెడీ…

ఈ నెల 27 నుంచి వారాహిపై ఉత్తరాంధ్ర నుంచి పవన్ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారట.. తొలి విడతలో పది నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా పవన్‌ కల్యాణ్‌ ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు.. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి సభలు, సమావేశాల్లో పాల్గొంటూనే మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప‌వ‌న్ ప్రచారం నిర్వహించనున్నారు.. ముఖ్యంగా జనసేన పోటీ చేసే స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేస్తారని చెబుతున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్‌ కల్యాణ్ బరిలోకి దిగనున్న నేప‌థ్యంలో ఆ నియోజ‌క‌వ‌ర్గంపై ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయనున్నారు.

- Advertisement -

..

Advertisement

తాజా వార్తలు

Advertisement