Thursday, May 2, 2024

ఏపీ గవర్నర్ ను కలిసే యోచనలో పవన్ కల్యాణ్

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనను మీట్ అయ్యేందుకు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. అపాయింట్ మెంట్ దొరికితే సాయంత్రం పవన్ కల్యాణ్ గవర్నర్ ను కలిసే అవకాశముంది. గత రెండు రోజులుగా విశాఖలో చోటు చేసుకున్న ఘటనలతో పాటు జన సైనికుల అరెస్టులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసే అవకాశముంది. అయితే గవర్నర్ బీబీ హరిచందన్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. మధ్యాహ్నానికి విజయవాడకు చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement