Monday, April 29, 2024

భీమ్లా నాయక్ గొడవ.. థియేటర్ లో పవన్ ఫ్యాన్స్ వీరంగం

పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఎస్ఎల్ఎం థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు వీరంగం సృష్టించారు. సినిమా ప్రదర్శించబడుతున్న సమయంలో కొద్దిసేపు నిలిపివేయడంతో ఆగ్రహానికి గురైన అభిమానులు.. చేతికి చిక్కిన వస్తువులతో ప్రాజెక్టులపై విసిరి పగలగొట్టారు. థియేటర్లో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు డిఎస్పి చైతన్య ఆధ్వర్యంలో రంగంలో దిగి ఆందోళనకారులును చెదరగొట్టారు. థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement