Sunday, April 28, 2024

Pawan Kalyan : పవన్ కు మరోసారి అస్వస్థత.. ప్రచారానికి బ్రేక్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మరోసారి ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొద్దిరోజుల క్రితం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్ కు జ్వరం రావడంతో.. హైదరాబాద్ లో చికిత్స తీసుకుని రెస్ట్ తీసుకున్నారు. ఈనెల‌ 5 నుంచి తిరిగి అనకాపల్లి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పవన్ అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, జనసేనాని మరోసారి అస్వస్థతకు గురి కావటంతో.. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి.

ఆదివారం గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. జనసేన అభ్యర్దిగా కొణతాల, ఎంపీ అభ్యర్దిగా సీఎం రమేష్ కు మద్దతుగా నిలవాలని ప్రజలను అభ్యర్దించారు. ఆ సమయంలోనే పవన్ ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది పడ్డారు. ప్రచార సభ ముగిసిన తరువాత పవన్ బాగా నీర‌స‌పడినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..పవన్ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement