Friday, May 17, 2024

విధ్వంసాలతో చంద్రబాబును, టీడీపీని అడ్డుకోలేరు – పరిటాల శ్రీరామ్

ధర్మవరం ఆగస్టు 4 ప్రభ న్యూస్ నాలుగుదశాబ్ధాల రాజకీయంలో చంద్రబాబు ఎన్నో సంఘటనలు చూశారని.. విధ్వంసాలతో ఆయన్ని ఆపాలనుకుంటే మీ అవివేకమని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు, అంగళ్లులో జరిగిన సంఘటనలను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ప్రజా సమస్యలపై యాత్ర చేస్తుంటే.. మంత్రి పెద్దిరెడ్డికి ఎందుకు అంత ఉలుకని ప్రశ్నించారు. ఒక ప్రతిపక్ష నేతపై దాడులకు తెగబడుతున్నారంటే.. రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

మాటకు ముందు మా పాలన ప్రశాంతంగా సాగుతోందని చెప్పే వైసీపీ దీనికి ఏం సమాధానం చెబుతుందన్నారు. ఓ వైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్, ఇంకో వైపు పవన్ కళ్యాణ్ పర్యటనలను అడ్డుకోవడం, గొడవలు సృష్టించడమే వైసీపీ పనిగా మారిందని విమర్శించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement