Monday, April 29, 2024

హ్యాండ్ బాల్ పోటీలలో టీం కెప్టెన్ గా.. పంచాయితీ సెక్రటరీ టి.సౌజన్య

దెందులూరు ప్రభ న్యూస్ – వారణాసిలో మార్చి15 నుండి 19 వరకు జరిగిన జాతీయ మహిళల హ్యాండ్ బాల్ పోటీల్లో టీం కెప్టెన్ గా ఏలూరు జిల్లాకు చెందిన టి.సౌజన్య ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా క‌లెక్ట‌రేట్ లో జిల్లా కలెక్టర్ వారిని మర్యాదపూర్వకంగా కలిశారు..కాగా సౌజన్య తాను పొందిన ప్రశంసా పత్రాలు, షీల్డ్ లను క‌లెక్ట‌ర్ కి చూపించారు. ఈ సందర్భంగా టి.సౌజన్యను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు. పెదవేగి మండలం విజయరాయి 2 పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 గా పనిచేస్తున్న టి.సౌజన్య ఏలూరులో ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు జరిగిన 8వ సీనియర్ మహిళల హ్యాండ్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నారు.అదేవిధంగా పూణె లో మార్చి 26 నుంచి 28 వరకు జరిగిన ఆల్ ఇండియా సివిల్ ఎంప్లాయీస్ టోర్నమెంట్ లో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డి పి వో జి.వి.కె.మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement