Saturday, May 4, 2024

Organ Donation: ఏడుగురికి అవయవదానం చేసిన యువతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సత్యవేడునియోజకవర్గం పిచ్చాటూరు మండలం రామాపురం హరిజనవాడకు చెందిన కీర్తి(20) చెన్నైలోని ఓ ప్రైవేట్ కాల్సెంటర్ లో పనిచేస్తోంది. అక్కడే బైకు పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కీర్తి బ్రెయిన్ డెడ్ కు గురైంది.

దీంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఆమె అవయవాలను 7మందికి అందజేశారు. ఈసందర్భంగా కీర్తికి నివాళులర్పిస్తూ చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో వాక్ ఆఫ్ హానర్ నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement