Monday, April 29, 2024

Vizag: వన్ టౌన్ కానిస్టేబుల్ రమేష్ దారుణ హత్య..!

విశాఖపట్నంలో వన్ టౌన్ కానిస్టేబుల్ రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. రమేష్ భార్య తన ప్రియుడు, అతని స్నేహితుడు సహాయంతో భర్తను అంతమొందించింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త కానిస్టేబుల్ రమేష్ ను పక్కా స్కెచ్ తో భార్య హతమార్చిన ఘటన చోటుచేేసుకుంది.

ఇంట్లోనే పథకం ప్రకారం తలగడా దిండుతో హత్య చేసి భార్య శివ జ్యోతి అలియాస్ శివాని గుండెనొప్పిగా చిత్రకరించింది. ట్యాక్సీ డ్రైవర్ తో వివాహేతర సంబంధమే హత్యకు కారణమైంది. భార్య గుట్టుచప్పుడుగా అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఎంవీపీ పోలీసుల విచారణలో భార్య అక్రమ సంబంధం బాగోతం వెలుగు చూసింది. బర్రి రమేష్ 2009లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement