Tuesday, April 30, 2024

AP: కోటి రూపాయ‌లు స్వాధీనం – ఇద్ద‌రు అరెస్టు

టంగుటూరు (ప్రభ న్యూస్) : ఏపీలో కోటి రూపాయలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జాతీయ రహదారిపై టోల్ గేట్ సమీపంలో మంగ‌ళ‌వారం జ‌రిగింది. ప్ర‌కాశం జిల్లా టంగుటూరు సమీపంలోని టోల్ గేట్ సింగరాయకొండ సీఐ రంగనాథ్ వాహనాలు తనిఖీ చేప‌ట్టారు.

ఈ సమయంలో మద్రాసు నుంచి గుంటూరు వైపు వ‌స్తున్న వాహ‌నంలో ఆధారాలు లేకుండా త‌ర‌లిస్తున్న కోటి రూపాయలను ప‌ట్టుకున్నారు. ఆ కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement