Thursday, May 2, 2024

AP: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

తిరుపతి సిటీ, ఆగస్టు 21, ప్రభ న్యూస్: చెన్నైకి చెందిన అరుణ్ గణేష్ (41) శనివారం ఉదయం ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో అజంతా లాడ్జి వద్ద సింగల్ రూమ్ అద్దెకు తీసుకోవడం జరిగింది. ఇవాళ ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో సిబ్బంది ఈస్ట్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈస్ట్ ఎస్ఐ జయ స్వాములు లాడ్జి వద్దకు వెళ్లి గది తలుపులు తొలగించి చూడగా.. ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించడం జరిగింది.

అతని దగ్గర ఉన్న ఆధారాలు మేరకు చెన్నైకి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. వారి దగ్గర ఉన్న ఆధారాలు మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, దీనిపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించినట్లు ఎస్సై తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement