Saturday, May 4, 2024

ఒక‌సారి పురుగుల మందు.. చావ‌క‌పోవ‌డంతో మ‌రోసారి..

జీవితంపై విసుగుచెందడంతో ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటున్న ఘ‌ట‌న‌లు మ‌నం చూస్తున్నాం.. అయితే ఒక‌సారి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డితే ప్రాణం పోక‌పోవ‌డంతో.. మ‌రోసారి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న కాకినాడ‌లో చోటుచేసుకుంది. కాకినాడలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ.. చావలేదని ఆస్పత్రిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.. జీజీహెచ్‌ ఓపీ బ్లాక్‌పై నుంచి దూకు ప్రాణాలు తీసుకుంది సదరు మహిళ.

కాకినాడ డైరీ ఫామ్‌ సెంటర్‌కి చెందిన ఇంద్రజ అనే మహిళ.. తనను భర్త నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆవేదనకు గురైంది.. చివరకు చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.. దీంతో, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్చారు. అయితే, తాను చావలేదని.. ఎలాగైనా ప్రాణాలు తీసుకోవాలనుకుంది ఆ మహిళ.. ఆ తర్వాత జీజీహెచ్‌ బిల్డింగ్ పై నుంచి దూకేసింది.. ఈ సారి అక్కడికక్కడే మృతిచెందింది ఇంద్రజ. రాజ్ కుమార్‌ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం ఇంద్రజకి వివాహం జరిగింది.. ఫోన్‌ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నాడని, పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని మనస్థాపానికి గురైన ఇంద్రజ.. ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.. ఈ ఘటనపై కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement