Saturday, May 4, 2024

ఈనెల 17న ఢిల్లీలో అమరావతి పరిరక్షణ సమితి ధర్నా..

అమరావతి పరిరక్షణ సమితి రాజధాని అమరావతి పరిరక్షణ ఆందోళన కార్యక్రమాలను మరింత ఉదృతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఢిల్లీ వేదికగా నిరసనలు తెలిపేందుకు అమరావతి పరిరక్షణ సమితి సిద్ధమైంది. ఈ నెల 17, 18, 19 తేదీలలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి, కార్యదర్శి గద్ద తిరుపతిరావు తెలిపారు. ఈనెల 17న అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధుల మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. 18న ఇతర రాష్ట్రాల ఎంపీలను కలవనున్నారు. 19న రామ్ లీలా మైదానంలో జరిగే కిసాన్ సంఘ్ లో పాల్గొంటారు. 1800 మందితో ప్రత్యేక రైలులో రాజధాని ప్రాంత రైతులు ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement