Thursday, April 25, 2024

మూడు రాజధానులు కాదు.. మూడు పెళ్లిళ్ల వల్లే మేలట.. సీఎం జగన్

మూడు రాజధానుల వల్ల కాదు.. మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారని..ఏం చేయలేని వాళ్లు బూతులు తిడుతున్నారన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… చెప్పులు చూపించి భూతులు తిడుతున్నారన్నారు. ఇలాంటి వాళ్లా మన నాయకులు అన్నారు. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తున్నాడో అంతా చూస్తున్నామన్నారు.

ఇది మంచి, చెడుకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. వీధి రౌడీలు కూడా ఇలా మాట్లాడరన్నారు. ఒక్క జగన్ ను కొట్టడానికి ఎంత మంది ఏకమయ్యారని అన్నారు. ఒక్కొక్కరు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోమని చెబితే అక్క చెళ్లెళ్ల జీవితాలు ఏం కావాలని అడిగారు. మహిళల జీవితాలు ఏం కావాలి.. సభ్య సమాజానికి ఏం సందేశమిస్తున్నారని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement