Thursday, May 2, 2024

AP: వాసవి శాంతి థామ్ లో నిర్మలా సీతారామన్ ప్రత్యేక పూజలు

పెనుగొండ, ఫిబ్రవరి 20 (ప్రభ న్యూస్) : పెనుగొండ క్షేత్రం వాసవి శాంతిథామ్ నందు పంచమ వార్షికోత్సవ మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు అఖిల భారత పెనుగొండ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ గోవిందరాజులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అనంతరం ఆలయంలో వాసవిమాతను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాసవి మాతకు బంగారు కిరీటం ఆవిష్కరణ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ మంత్రి స్థానిక శాసన సభ్యులు చెరుకువాడ రంగనాథరాజు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో పితాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ గాంధీ, తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement