Friday, May 17, 2024

కొత్తగా 41 కరోనా కేసులు.. తగ్గిన ఎఫెక్ట్​

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 10,502 శాంపిల్స్‌ను పరిశీలించగా 41 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా మరణాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. కాగా 75 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అనంతపురంలో 15, చిత్తూరులో 3, ఈస్ట్‌ గోదావరిలో 10, గుంటూరు 1, వైఎస్‌ఆర్‌ కడప 1, కృష్ణా 1, కర్నూలు 0, నెల్లూరు 1, ప్రకాశం 1, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 5, విజయనగరం 0, వెస్ట్‌ గోదావరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 కోట్ల 33 లక్షల 92 వేల 042 శాంపిల్స్‌ను పరిశీలించగా 23 లక్షల 19 వేల 448 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 23 లక్షల 04 వేల 323 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం 395 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement