Friday, May 17, 2024

కడప జిల్లాకు మరో పరిశ్రమ..సీఎం జగన్ ని కలిసిన సెంచరీ ప్లైబోర్డ్స్ ప్రతినిధులు..

కడప జిల్లాకు మరో కొత్త పరిశ్రమ రాబోతోంది. బద్వేలులో సెంచరీ ప్లైబోర్డ్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నూతన ప్లాంట్ ఏర్పాటు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు సెంచరీ ప్లైబోర్డ్స్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ భజంకా, ఈడీ కేశవ్ భజంకా తదితరులు సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. తమ సంస్థ తాజా ప్రణాళికలను ఆయనకు వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ కూడా పాల్గొన్నారు. ఏపీలో రూ.1000 కోట్ల పెట్టుబడితో 3 దశల్లో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతామని సెంచరీ ప్లైబోర్డ్స్ ప్రతినిధులు సీఎం జగన్ కు వివరించారు. ఈ ప్లాంట్ ద్వారా 3 వేల మందికి ప్రత్యక్ష, 6 వేల మందికి పరోక్ష ఉపాధి కలుగుతుందని తెలిపారు. రైతులతో యూకలిప్టస్ తోటల సాగును ప్రోత్సహించి, వాటిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం ద్వారా రైతులకు చేయూతగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా, బద్వేలులో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ ప్లాంట్ 2024 డిసెంబరు నాటికి పూర్తికానుంది.

ఇది కూడా చదవండి: జగన్ బెయిల్ రద్దు విషయంలో ‘సాక్షి’ మీడియా అత్యుత్సాహం.. సెటైర్లు వేసిన రఘురామ

Advertisement

తాజా వార్తలు

Advertisement