Friday, May 3, 2024

Breaking: ఏపీలో కొత్త జిల్లాల కసరత్తు పూర్తి.. ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలకు సంబంధించి కసరత్తు మొత్తం పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టమని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ కేంద్రాలను ఆధారంగా చేసుకొని జిల్లాలను విభజన చేశామని చెప్పారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉండబోతుందని వెల్లడించారు. ప్రజా ప్రయోజనాల అనుగుణంగా మనోభావాలు దెబ్బతినకుండా జిల్లాలు ఏర్పాటు చేశామని చెప్పారు. చిన్న చిన్న మార్పులతోనే తుది నోటిఫికేషన్ వెలువడబోతుందని ప్రకటించారు. సీవీక్ సొసైటీల సలహాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని, 90 శాతం ప్రభుత్వ భవనాల్లోనే కొత్త జిల్లాల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొత్త జిల్లాల్లో అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఒకే చోటా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని సజ్జల తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement