Wednesday, May 8, 2024

జ‌గ‌న‌న్న విద్యా కానుక పంపిణీ స‌క్ర‌మంగా జ‌ర‌గాలి

ముత్తుకూరు : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ చేయనున్న నేపథ్యంలో మంగళవారం విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్, జగనన్న విద్యా కానుక నోడల్ ఆఫీసర్ సుబ్బారావు స్టాక్ పాయింట్ ను పరిశీలించారు. మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన పాయింట్ ను ప‌రిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్, జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చెంచు రామయ్య తో ఆర్ జెడి మాట్లాడారు. సక్రమంగా విద్యా కానుక పంపిణీ జ‌రిగేలా చూడాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆదేశించారు. సుమారు 6000 మంది విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement