Thursday, April 25, 2024

మహిళలపై దాడుల నియంత్రణకు ప్రత్యేక దృష్టి

గూడూరు: మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని పట్టణ సీఐ దశరధరామారావు పేర్కొన్నారు.సోమవారం గూడూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో దిశ పెట్రోలింగ్ వాహనాలను సి.ఐ దశరథరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రణకు ప్రభుత్వం పెట్రోలింగ్ వాహనాలు ఏర్పాటు చేసిందన్నారు.ఒకటవ,రెండో పట్టణ పోలీసు స్టేషన్లకు రెండు వాహనాలను కేటాయించినట్లు ఆయన తెలిపారు.మహిళలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు బ్రహ్మనాయుడు,రోజా లత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement