Sunday, April 28, 2024

బిటెక్ విద్యార్ధినికి క్లాస్ రూమ్ లోనే అబార్ష‌న్ – క‌న్నుమూత‌.

నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ చదువుతున్న విద్యార్థినికి త‌ర‌గ‌తి గ‌దిలోనే అబార్షన్ అయింది.. దీంతో ఆమె అక్క‌డే క‌న్నుమూసింది. వివ‌రాల‌లోకి వెళితే మర్రిపాడు మండలానికి చెందిన యువతి (19) నెల్లూరులో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 11న కళాశాల విద్యార్థులందరూ ప్రాంగణంలో ఉండగా యువతి ఒక్కరే గదిలో ఉండి తలుపులకు గడియ పెట్టుకున్నారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి స్నేహితులు తలుపులు పగలగొట్టి చూడగా తరగతి గదిలోనే తీవ్ర రక్తస్రావంతో యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. పక్కనే ఆరు నెలల పిండం ఉంది. తోటి విద్యార్థులు హుటాహుటిన తల్లిని, పిండాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా త‌ల్లి మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు.. దీనిపై ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు నెల్లూరు రూర‌ల్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.. తరగతి గదిలోనే అబార్షన్‌ అయ్యిందా?. లేదా వీడియో ద్వారా తనకు తానే అబార్షన్‌ చేసుకుందా? అనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement