Friday, April 26, 2024

ఏపీ జెన్ కో ప్రైవేటీక‌ర‌ణ‌కు నిర‌స‌న‌గా బీజేపీ ధ‌ర్నా

ఏపీ జెన్ కో ప్రైవేటీకరణకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధర్నాకు దిగారు. నెల్లూరు జిల్లాలో ఆయన ధర్నా చేపట్టారు. ఎట్టిపరిస్థితుల్లో ఏపీ జెన్ కోను ప్రైవేటీకరించకుండా అడ్డుకుంటామని సోము వీర్రాజు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రైవేటీకరించలేదన్నారు. అయినా దానిని విక్రయించే ఆలోచన లేదని సోము వీర్రాజు తెలిపారు. వైసీపీ నేతలు పార్లమెంటులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ప్రశ్నలు వేస్తారని, ఇక్కడ మాత్రం జెన్ కోను ప్రైవేటీకరిస్తారని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు చెప్పేదొకటి చేసేదొకటి అని అన్నారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఏటా నిధులు కేటాయిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement