Thursday, April 25, 2024

ఆదాలే నెల్లూరు రూర‌ల్ ఇన్ ఛార్జి…

అమ‌రావ‌తి – నెల్లూరు రూర‌ల్ ఇన్ ఛార్జీగా వైసిపి ఎంపి ఆదాల ప్ర‌భాక‌ర‌రెడ్డి నియ‌మితుల‌య్యారు.. ఈ మేర‌కు ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌క‌టించారు.. ప్ర‌స్తుతం రూర‌ల్ వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి పార్టీపై తిరుగుబాటు చేయ‌డంతో దిద్దుబాటు చ‌ర్య‌లు ప్రారంభించింది.. అందుబాటులో ఉన్న‌సీనియ‌ర్ నేత‌ల‌తో జ‌గ‌న్ నేడు త‌న నివాసంలో సుదీర్ఘంగా చ‌ర్చించారు.. అంద‌రి అభిప్రాయాల‌కు అనుగుణంగా ఆదాల‌ను ఇన్ ఛార్జిగా నియ‌మించారు.. అలాగే వ‌చ్చే ఎన్నికల‌లో ఆదాల రూర‌ల్ నుంచి పోటీ చేసే అవ‌కాశాలున్నాయ‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం.. కాగా,త‌న‌కు రూర‌ల్ స‌మ‌న్వ‌య బాధ్య‌త‌లు అప్ప‌గించినందుకు జ‌గ‌న్ కు ఆదాల కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.. పార్టీని విజ‌య‌ప‌ధంలో న‌డిపేందుకు నిరంత‌రం కృషి చేస్తాన‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement