Sunday, April 28, 2024

ఏపీ జెన్కో థర్మల్ కేంద్రంలో ప్ర‌మాదం.. ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

ముత్తుకూరు, ఏప్రిల్ 27 (ప్రభ న్యూస్) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఏపీ జెన్కో బొగ్గు ఆధారిత ధర్మల్ విద్యుత్ కేంద్రంలో గురువారం విద్యుత్ ప్రమాదం జరిగింది. థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఎలక్ట్రికల్ బ్రేకర్ పేలడంతో ఇద్దరు కార్మికులు అయినటువంటి సురేష్, కార్తీక్ లు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా బ్రేకర్ పేలడంతో కార్మికులను మంటలు చుట్టుముట్టాయి. ఏపీ జెన్కో సీసీ ఆర్ లోని ఏ హెచ్ పి విభాగంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రికల్ బ్రేకర్ పేలుడు వేగానికి కార్మికుడు సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ముఖం చేతులు కాళ్లు తీవ్రంగా కాలిపోవడం జరిగింది. కార్తీక్ స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడిన కార్మికులు ఇద్దరు ప్రైవేట్ హాస్పిటల్ నందు వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఈ సంఘటనతో ఏపీ జెన్కో కార్మికులు భయాందోళనకు గురైనారు. ఈ ప్రమాదంపై ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఉన్నతాధికారులు పూర్తి బాధ్యత వహించాలని ఏపీ జెన్కో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement