Thursday, May 2, 2024

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం..
ఒక‌రి దుర్మ‌ర‌ణం, ఇద్ద‌రికి గాయాలు

వ‌రికుంట‌పాడు: నెల్లూరు జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఒక్క‌రు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. వరికుంటపాడు కోల్డ్ స్టోరేజ్ స‌మీపంలో జాతీయ రహదారిపై కారు అదుపు త‌ప్ప‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. మృతిచెందిన‌ది పామూరుకు చెందిన నాదెండ్ల వెంక‌ట‌రావుగా గుర్తించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌మాదంలో గాయాల‌బారిన ప‌డిన ఇద్ద‌రిని చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement