Saturday, May 18, 2024

మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం.. సీతారాం ఏచూరి

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. విజయవాడలో దేశ రక్షణ భేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… కార్పొరేట్లకి రాయితీలు ఇచ్చి కేంద్రం సామాన్యుల నడ్డివిరుస్తోందని వెల్లడించారు. మోడీ ప్రభుత్వాన్ని జగన్‌ ప్రభుత్వం నిలదీయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన రూ.36 వేల కోట్ల నిధులు కేంద్రం ఇవ్వలేదన్నారు.

బీజేపీ పార్టీలోకి రాని వారిపై ఈడిచే దాడులు చేయిస్తుందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు ఎక్కువైపోయాయన్నారు. భారతదేశాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లౌకికవాదాన్ని కాపాడేందుకు ముందుకొచ్చే వారితో కలిసి పనిచేద్దామని పేర్నొన్నారు. దేశంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయన్నారు. ప్రధాని మోడీ కార్పొరేట్లకి రూ. 13 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. ఏడేళ్లలో అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేర్చారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement