Friday, May 3, 2024

ST Commission: పాలకొండ నిర్మల ఫిర్యాదు… ఏపీ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసు జారీ చేసింది. తన పేరు ఓపెన్‌ కేటగిరీలో తొలి స్థానంలో ఉన్నప్పటికీ తనకు ఉద్యోగం ఇవ్వలేదంటూ సారవకోట మండలం గోవర్ధనపురం పంచాయతీ అర్లి గ్రామానికి చెందిన పాలకొండ నిర్మల ఫిర్యాదు చేయగా జాతీయ ఎస్టీ కమిషన్​ స్పందించింది.

జనవరి 2న ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్‌ ముందు హాజరుకావాలని ప్రవీణ్ ప్రకాశ్‌ను ఆదేశించింది. గత నెల 17న ప్రవీణ్ ప్రకాశ్‌కు నోటీసులు అందగా ఆయన స్పందించకపోవడంతో జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ అయ్యింది. పూర్తి వివరాలతో నేరుగా వచ్చి తమ ముందు హాజరు కావాలని ప్రవీణ్ ప్రకాశ్‌కు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement