Saturday, May 4, 2024

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోకి ప్ర‌వేశించిన నారా లోకేష్ … యువగళంతో పోటెత్తిన ప్రకాశం బ్యారేజి!.. వీడియోతో

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో – యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్రకు నగర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పూర్తయిన యువగళం పాదయాత్ర శనివారం సాయంత్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. ప్రకాశం బ్యారేజి వద్ద ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు కార్యకర్తలు వీడ్కోలు పలికారు.

బ్యారేజ్ వ‌ద్ద పసుపు, ఎరుపురంగు బెలూన్లతో యువనేతకు ఉమ్మడి కృష్ణా జిల్లా , నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన జనంతో ప్రకాశం బ్యారేజి పరిసరాలు జనసముద్రంగా మారాయి. లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆనందోత్సాహాల నడుమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేరింతల కొడుతూ ముందుకు సాగారు. బాణాసంచా మోతలు, నినాదాలతో ప్రకాశం బ్యారేజి పరిసరాలు హోరెత్తయి. భారీ గజమాలలు, పూలవర్షంతో లోకేష్ కు వారి అభిమానాన్ని ముంచేత్తించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement