Thursday, May 2, 2024

జ‌గ‌న్ అన్న‌.. అన్నందుకు అక్కాచెల్లెమ్మ‌ల‌పైకి పోలీసుల్ని పంపారా ! : నారా లోకేష్

జ‌గ‌న్ అన్న.. అన్నందుకు గ‌న్ లు ప‌ట్టుకున్న పోలీసుల్ని అక్కాచెల్లెమ్మ‌ల‌పైకి పంపారా సీఎం గారూ! అని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్ర‌శ్నించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ కి వేలాది ఎక‌రాలు ఇచ్చిన‌ త‌మ‌ను కాద‌ని, ఇత‌ర రాష్ట్రాల వారికి ఉపాధి క‌ల్పిండ‌మేంట‌ని మైథాన్ కర్మాగారం వ‌ద్ద శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న మ‌హిళ‌ల‌పై పోలీసుల‌తో లాఠీచార్జీ చేయ‌డ‌మేనా అక్కాచెల్లెమ్మ‌ల‌కు మీరిచ్చే బహుమ‌తి!. స్థానికుల‌కు ఉపాధి క‌ల్పించాల‌ని డిమాండ్ చేయ‌డం మీ దృష్టిలో నేర‌మైతే… ప్రైవేట్ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ స్థానికుల‌కే 70 శాతం ఉద్యోగాలు అని జీవో తెచ్చి, అమ‌లు చేయ‌ని మీరు ఏ1 ముద్దాయి. మీ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త‌లేదు, చివ‌రికి ఉపాధి కోసం రోడ్డెక్కితే చావ‌గొట్టించారు. ఇది ఒక ప్ర‌జాస్వామ్య‌యుతంగా ఏర్ప‌డిన ప్ర‌భుత్వమ‌ని మీరెప్పుడో మ‌రిచిపోయారు. రాజ్యాంగ‌బ‌ద్ధంగా ప‌నిచేయాల‌నే సంగ‌తి మీ పోలీసుల‌కూ గుర్తు రాదు. నిరుపేద మ‌హిళ‌ల ప‌ట్ల ఎన్నాళ్లీ దౌర్జ‌న్యాలు, దాడులు? దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత మహిళలకు టీడీపీ అండగా ఉంటుందని నారా లోకేష్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement