Monday, April 29, 2024

ఏపీలో వైసీపీబన్లు.. తాలిబన్లని మించిపోయారు

తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఉన్న భరతమాత విగ్రహం తొలగింపు వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై ప్రతిపక్ష టీడీపీ విమర్శలు ఎక్కి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు… అరాచకాలు చేయడంలో తాలిబన్లని మించిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సీఎం జగన్ తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని, నిరుపేదల ఇళ్లు కూల్చేసారని విమర్శించారు. ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారని మండిపడ్డారు. తనకి 2 కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి… తన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనం అని అన్నారు. ప్రొక్లయినర్లతో పెకలించిన భరత మాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని, చేసిన మూర్ఖపుపనికి క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement