Thursday, April 25, 2024

టీడీపీ కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు: జగన్ సర్కార్ పై లోకేష్ ఫైర్

వైసీపీ ప్రభుత్వంలో అన్నీ ఆరచకాలేని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. పాదయాత్ర సమయంలో అన్నీ పెంచుకుంటూ పోతున్నారని ఎద్దేవా చేసిన జగన్.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చెత్తపై పన్ను.. ఇంటి పన్నుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీల మొదలు అన్నీ పెంచుకుంటూ పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక  వైసీపీకి వడ్డీతో సహా అన్ని చెల్లిస్తామని హెచ్చరించారు. అధికారం అడ్డు పెట్టుకుని తమను ఏం చేయలేరన్నారు. టీడీపీ కార్యకర్తల గడ్డం కాదు కదా వెంట్రుక కూడా పీకలేరని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement