Tuesday, April 23, 2024

పాండ్యాకు కరోనా.. రెండో టీ20 వాయిదా

శ్రీలంక టూర్‌లో ఉన్న టీమ్ ఇండియ‌ను కరోనా వదిలిపెట్టలేదు..ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా కరోనా వైర‌స్ బారిన ప‌డ్డాడు. దీంతో నేడు జ‌ర‌గాల్సిన రెండో టీ20ని వాయిదా వేశారు. ప్ర‌స్తుతం రెండు జ‌ట్లూ ఐసోలేష‌న్‌లో ఉన్నాయి. ఒక‌వేళ టీమ్స్‌లోని అంద‌రు ప్లేయ‌ర్స్ నెగటివ్‌గా తేలితే.. బుధ‌వారం ఈ రెండో టీ20 నిర్వ‌హిస్తారు. ఆదివారం జ‌రిగిన తొలి టీ20లో ఇండియా 38 ప‌రుగుల‌తో గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కృనాల్ ఆడాడు. రెండు ఓవ‌ర్ల‌లో 3 ప‌రుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కాగా మొదటి మ్యాచ్ లో శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది. మరి వాయిదా పడిన మ్యాచ్ ఎప్పుడు నిర్వహిస్తారనేది క్లారిటీ రావల్సి ఉంది.

ఇది కూడా చదవండి : ఒలింపిక్స్ ఎఫెక్ట్..?టోక్యోలో భారీగా కరోనా కేసులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement