Sunday, April 28, 2024

నల్లారి సేవ‌లు కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవ‌స‌రం.. ఏఐసీసీ కార్యదర్శి మ‌య్య‌ప్ప‌న్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ముఖ్యమంత్రిగా ప‌నిచేసిన న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి వంటి సీనియ‌ర్ లీడర్ల అవ‌స‌రం కాంగ్రెస్ పార్టీకి చాలా అవ‌స‌ర‌మ‌ని ఏఐసీసీ సెక్ర‌ట‌రీ మ‌య్య‌ప్ప‌న్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేర‌కే కిర‌ణ్ రెడ్డి ఢిల్లీకి వ‌చ్చి ఉంటార‌న్న మ‌య్య‌ప్ప‌న్‌.. ఆయనకు ఏ బాధ్య‌త అప్ప‌గించాల‌న్న విష‌యంపై పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పారు. పార్టీ వ‌ల్ల ప‌దవి, అధికారం, ప్ర‌యోజ‌నాలు పొందిన వారు పార్టీకి తిరిగి సేవ‌లు చేయాల్సిన అవ‌స‌రం వచ్చింద‌న్న ఆయ‌న‌.. ఆ విష‌యాన్ని ఉద‌య్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన చింత‌న్ శిబిర్‌లో చర్చించినట్టు తెలిపారు.

ఇక.. కిర‌ణ్ కుమార్ రెడ్డి తిరిగి యాక్టివేట్ కావాల్సిన అవ‌స‌రాన్ని త‌న‌తో పాటు పార్టీ ఏపీ వ్య‌వ‌హారాల ఇన్​చార్జి ఉమెన్ చాందీ ఇప్ప‌టికే ప‌లుమార్లు సూచించార‌ని తెలిపారు. రాష్ట్ర స్థాయిలోనైనా, జాతీయ స్థాయిలోనైనా కాంగ్రెస్​ పార్టీకి సేవ‌లందించాల‌ని ఆయ‌న‌ను కోరినట్టు తెలిపారు. ఆ దిశ‌గా ఆలోచించిన మీద‌టే కిర‌ణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ టూర్‌కు వ‌చ్చి ఉంటార‌న్నారు మ‌య్య‌ప్ప‌న్‌.. ఇది ఆహ్వానించ‌ద‌గిన విష‌యమేన‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement