Thursday, May 2, 2024

Nagari – ద్రోహం చేసిన బి జె పితో దోస్తీకి బాబు, జగన్ ల తహతహ – షర్మిల

నగరి ( రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) :హోదా అడిగితే జైల్లో పెట్టించిన చంద్రబాబు, హోదా గురించి కేంద్రాన్ని నిలదీయలేని జగన్, ఇప్పుడు రాష్ట్రానికి ద్రోహం చేసిన బి జె పి తో పొత్తుల కోసం పోటీలు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల ఏద్దేవా చేసారు. చిత్తూరు జిల్లా నగరి లో ఆమె ఈరోజు సాయంత్రంజరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఆ సందర్బంగా మంత్రి రోజా పై విరుచుకు పడుతూ జబర్దస్త్ రోజా జబర్దస్తి గా దోచుకుంటున్నారని అన్నారు. ఆమె కాక ఆమె కుటుంబ సభ్యులలందరూ మంత్రుల్లా వ్యవహారిస్తూ ఉన్నారని ఆరోపించారు. తనపై రోజా చేసిన విమర్శలను ప్రస్థావిస్తూ ఇదేవిధంగా తెలంగాణ లో తనపై నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్లకు పట్టిన గతే తప్పదని శాపనార్ధాలు పెట్టారు

.వై ఎస్సార్ బిడ్డ కదా అని చూస్తున్నాం అని బాపట్ల లో ఒకడు మాట్లాడాడని ప్రస్థావిస్తూ ఇప్పుడు తాను వై ఎస్సార్ కూతుర్ని కాదు అనుకుని దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఇవ్వాల్సిన డబ్బులు తాను తెస్తే వీళ్ళేమైనా గాడిదలు కాస్తుంటారా అని అన్నారు.

ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని అడిగిన చంద్రబాబు అధికారం లో ఉన్నప్పుడు .హోదా పై మాట్లాడితే జైల్లో పెట్టించారని, ఇప్పుడు అధికారం లో జగన్ రెడ్డి 25 మంది ఎంపిలు ఇస్తే హోదా తెస్తా అని మాట మార్చాడని విమర్శించారు ఇప్పుడు ఇద్దరికీ బీజేపీ తో పొత్తులు కావాలని పోటీ పడి పొత్తులు కోరుకుంటున్నారని,బీజేపీ కాళ్ళ మీద పడుతున్నారని షర్మిల విమర్శల వర్షం కురిపించారుకాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ మీద అపారమైన అభిమానం ఉంది కనుకనే కాంగ్రెస్ లో చేరానని,ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తామని హామీ ఇస్తేనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement