Friday, May 10, 2024

Murder – రాంపురంలో మహిళ హత్య

తుగ్గలి జులై 15 (ప్రభ న్యూస్)తుగ్గలి మండలం జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోనే రాంపురం గ్రామంలో శనివారం రాత్రి పద్మావతి (35) అనే మహిళ హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా, గుంతకల్ మండలం, ములకలపెంట గ్రామానికి చెందిన పద్మావతి కు రాంపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వరతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల కుమార్తెను పద్మావతి బంధువులకు (ములకలపెంటకు) ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అయితే పద్మావతి రాంపురం లో ఇంట్లోనే హత్యకు గురయింది .

హత్యకు గురైన పద్మావతిని ఎవరు చంపారు అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement