Thursday, May 9, 2024

జ్యోతుల నవీన్ కు ముద్రగడ సంఘీభావం

తిరుమలకు పాదయాత్ర చేస్తున్న టీడీపీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్, మాజీ జ‌డ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సంఘీభావం తెలిపారు. తూర్పు గోదావ‌రి జిల్లా రాజానగరం మండలంలో జీఎస్ఎల్ సమీపంలో ముద్రగడ పద్మనాభం నవీన్ కుమార్ ను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని ముద్రగడ దీవించారు. నవీన్ వెంట రాజానగరం నియోజకవర్గం టీడీపీ నాయకులు గంగిశెట్టి చంటిబాబు, చిట్టిప్రోలు పద్దరాజు, నూనె వెంకన్న, తదితరులు వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement