Sunday, May 5, 2024

చంద్రబాబు ఓ పొలిటికల్ బ్రోకర్: విజయసాయి ఘాటు వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్ అని వ్యాఖ్యానించారు. ‘’పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కొనిపడేసి, తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నాడు. కిందటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఆపార్టీని భ్రష్టపట్టించాడు. ఇప్పుడు డైరెక్టుగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు’’ అని విజయసాయి ట్వీట్ చేశారు.

‘’కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు బిజెపి తీర్థం ఇప్పించాడు. ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణా పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించాడు. పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్ లోకి  తోలాడు. బాబా మజాకా!’’ అంటూ విమర్శించారు.

ఇది కూడా చదవండి: పుదుచ్చేరి కేబినెట్‌లో 40 ఏళ్ల తర్వాత మహిళకు చోటు!

Advertisement

తాజా వార్తలు

Advertisement