Friday, May 3, 2024

సీఎం జగన్‌కు రఘురామ మరో లేఖ.. ఈసారి ఏంటంటే

ఏపీ సీఎం జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ ఆర్థిక శాఖ బిల్లుల ఆడిట్‌పై సీఎం జగన్ కు రఘురామ లేఖలో రాశారు. ట్రెజరీ కోడ్‌కు విరుద్ధంగా భారీగా నిధులు బదిలీ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని లేఖలో పేర్కొన్నారు. నిధులకు లెక్కలు చూపకపోవడం పొరబాటున జరిగింది కాదని తెలిపారు. నిధుల వినియోగంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ప్రతి చెల్లింపును ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌ శాఖ నుంచే చేయాలన్నారు. సీఎఫ్‌ఎంఎస్ నుంచి చేస్తున్న చెల్లింపులపై ఆడిట్ జరిపించాలని రఘురామ లేఖలో కోరారు.

ఇది కూడా చదవండి: ప్రభుత్వ సలహాదారులు రాజకీయాలు మాట్లాడటమేంటి: ఏపీ హైకోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement