Wednesday, May 1, 2024

చంద్ర‌బాబుకు బొకే ఇచ్చేందుకు.. నిరాక‌రించిన ఎంపీ కేశినేని నాని

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ఆపార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్వహించనున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు సాయంత్రం హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అయితే చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు ఎంపీ కేశినేని నాని నిరాకరించారు. చంద్రబాబుకు బొకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరగా దాన్ని నాని తిరస్కరించారు. కనీసం చంద్రబాబు దగ్గరకు వెళ్లేందుకు కూడా నాని ఇష్టపడలేదు. బహిరంగ నిరసన తెలిపేందుకే నాని ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో టీడీపీలో చర్చకు దారితీసింది. తాజాగా చంద్రబాబు.. నాని ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఆయన హుషారుగానే కనిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement