Thursday, April 25, 2024

ప్రజల బాధలు పట్టదా?: టాలీవుడ్ హీరోలపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి సంచలన వ్యాఖ్య

టాలీవుడ్ హీరోలపై నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల వల్లే హీరోలు అయ్యారని.. ప్రజల్లో కష్టాల్లో ఉంటే సహాయం చేస్తామని చెప్పకపోవడం, ఆదుకోకపోవడం బాధగా ఉందన్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప వర్షాలు, వరదలతో నష్టపోయాయి అని చెప్పారు. సినిమా ఇండస్ట్రీ హీరోలు, ప్రముఖులు స్పందించకపోవడం బాధగా ఉందన్నారు. కనీసం ఒక స్టేట్‌మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. హీరోలు బయటకు వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏదో ఒక సాయం చేయాలని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

గతంలో ఎన్టీఆర్, అక్కినేని వరదలు వచ్చినా, ప్రజలకు కష్టాలు వస్తే జోలి పట్టి రోడ్డు మీదకు వచ్చేవారన్నారు. హీరోలు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారని, హీరోలను చేసిన ప్రజల్ని మర్చిపోయారన్నారని విమర్శించారు. ఇకనైనా స్పందించి ముందుకు రావాలని.. సంపాదించిన దాంట్లో సాయం చేయాలి కోరారు. ఆపదలో సాయం చేసేవారిని అందరూ గుర్తు పెట్టుకుంటారని, ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజలు తీవ్రంగా నష్టపోయారని.. వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యే నల్లపరెడ్డి కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement