Tuesday, May 7, 2024

క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోనేటి

క్రిస్మస్‌ సందర్భంగా చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు అందరికీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్‌ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నామని ఆయన అన్నారు.  క్రిస్మస్‌ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన చెప్పారు.

దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం–త్యాగాలకు జీసస్‌ తన జీవితం ద్వారా బాటలు వేశారని ఎమ్మెల్యే చెప్పారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం కలిగి ఉండాలన్నారు. ఇవీ జీసస్‌ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement