Monday, April 29, 2024

AP : రూ. 7.95 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

శ్రీ సత్యసాయి బ్యూరో, డిసెంబర్ 9(ప్రభన్యూస్) కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి కార్యాలయం నందు శాసనసభ్యులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన రూ. 7.95 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు శనివారం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహాయ నిధి నుండి ఆరోగ్యశ్రీలో కవర్ కానటువంటి వివిధ జబ్బులతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రి నందు చికిత్స తీసుకొన్న వారికి నేడు రూ.7.95 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వైద్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ప్రతి పేద వారికి కార్పొరేట్ అందించడమే లక్ష్యంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం ఎంతో మంది పేదవారి ప్రాణాలను కాపాడగలిగిందన్నారు. తన తండ్రి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి నడుస్తూ రూ.1000 రూపాయలకు పైబడిన ప్రతి జబ్బుకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ పేదవారి ఆరోగ్యానికి భరోసా ఇచ్చారన్నారు. పేదవారికి అండగా ఉండే జగన్మోహన్ రెడ్డి కి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement